చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్లు చివరిదశకు చేరుకున్నాయని, నవంబర్ వరకు అందుబాటులో వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.ఇప్పటికే చైనా నాలుగు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలిసిందే.
వీటికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి.ఈ వ్యాక్సిన్లలో మూడింటిని అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చామని సీడీసీ తెలిపింది.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతుందని, వైరస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో టీకా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వస్తుందని సీడీసీ అధికారి వెల్లడించారు.
ఈ వ్యాక్సిన్ల వినియోగం కోసం ఇప్పటికే చైనా మార్గదర్శకాలను విడుదల చేసింది.
చైనా ఔషధ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), యూఎస్ కాన్సినో బయోలాజిక్స్-6185 అభివృద్ధి చేయబడుతున్న నాల్గవ వ్యాక్సిన్ ను చైనా సైన్యానికి వినియోగించేందుకు ప్రభుత్వం ఆమోదించింది.మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సినోపార్మ్ సంస్థ ఇదివరకే వెల్లడించింది.
వ్యాక్సిన్ వినియోగంపై ఎలాంటి అపోహలు వద్దని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే వ్యాక్సిన్లు అందుబాటులో తీసుకొస్తామని సీడీసీ అధికారి ప్రకటించారు.