ప్రపంచంలోని దేశాల్లో మరీ దిగజారుడు చర్యలకు పోయే దేశం ఏదంటే చైనా, పాకిస్దాన్ అని టక్కున చెప్పేస్తారట మన భారతీయులు.అసలే కరోనా పుట్టించిన దేశంగా చైనా పేరు గాంచగా, ఉగ్రవాద దేశంగా పాకిస్దాన్ కీర్తించబడుతుంది.
ఇక ఈ రెండు దేశాలు ఆధిపత్య పోరుకోసం ఏకం అయ్యి అధికార కాంక్షతో రగిలిపోతున్నాయట.
ఈ క్రమంలోనే ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్న చైనా ఈ మధ్య కాలంలో భారత సరిహద్దుల్లో ఎన్నో దారుణాలు చేసింది.
ఇంకా చేస్తుంది.అయితే ఈ నేపద్యంలో మరో దారుణం వెలుగు చూసింది.
తమ దేశంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లను తీసుకోవాలని నేపాల్పై చైనా ఒత్తిడి తెస్తుందట.ఈ విషయాలు చైనా రాయబార కార్యాలయ పత్రాల ద్వారా బయటకు వెల్లడయ్యాయి.
ఇక నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ జవాలితో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చైనా వ్యాక్సిన్ను ఆమోదించాలని ఒత్తిడి తీసుకొచ్చారట.అంతే కాదు మరికొన్ని చిన్న, పేద దేశాలను కూడా ఈ డ్రాగన్ కంట్రీ బెదిరిస్తుందట.తమ దేశంలో తయారైన సైనోవాక్ వ్యాక్సిన్ కొనుగోలు చేయాలంటూ బెదిరిస్తున్న చైనా, ముందు వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలని, ఆ తర్వాతనే టీకా డాటా అందజేస్తామని అనడం ఆశ్చర్యం.మరోవైపు చైనా రాయబార కార్యాలయం ఈ విషయంపై మాట్లాడటానికి నిరాకరించింది.
ఇక నేపాల్ మాత్రమే కాదు, పాకిస్తాన్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు చైనా వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయంటే అర్ధం చేసుకోండి చైనా వ్యాక్సిన్ పనితనం.