ఒకపక్క భారత్-చైనా లమధ్య చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనుకుంటున్న సమయంలో ఇప్పుడో పరిణామం చోటుచేసుకుంది.పొరుగుదేశం పాకిస్థాన్ కు శక్తివంతమైన రెండు డ్రోన్ లను డ్రాగన్ దేశం తరలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సరిహద్దుల వద్ద వింగ్ లూంగ్-2 ఆర్మ్డ్ డ్రోన్లను వాడుతున్న డ్రాగన్ దేశం, ఇప్పుడు శక్తివంతమైన రెండు డ్రోన్ లను పాక్ కు తరలించడం పెద్ద చర్చనీయాంశమవుతుంది.ఈ డ్రోన్ల సహాయంతో గాల్లో నుంచి ఉపరితలాల మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే 12 మిసైళ్ల చొప్పున ఉంటాయి.
అయితే ఈ విషయం పై చైనా మాత్రం తన నిర్మాణాలను కాపాడుకునేందుకే డ్రోన్లను పంపిస్తున్నానని చెబుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాక్ కు డ్రోన్ లను పంపడం మాత్రం అనుమానాలు కలిగిస్తుంది. గాల్వాన్ ఘటన విషయం పై ఇప్పటికి కూడా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం తో ఆ దేశానికి దీటుగా భారత్ కూడా సరిహద్దుల వద్ద ఇప్పటికే సైన్యాన్ని మోహరించింది.
ఒకవేళ చైనా చర్యలకు పాల్పడితే క్షిపణులతో దాడి చేసేందుకు అమెరికాకు చెందిన ఆల్టిట్యూడ్ లాంగ్- ఎండ్యూరెన్స్ ఆర్మ్డ్ ప్రెడేటర్ బీ- డ్రోన్ల వినియోగంపై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.అంతే కాకుండా ఇప్పటికే ఇదే అంశం పై అగ్ర దేశాలు అన్ని కూడా భారత్ కు అండగా నిలుస్తున్న విషయం విదితమే.