భార్య భర్తల అనుబంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు.
ఇక మాట్లాడుకోకుండా అసలు సాధ్యం కాదేమో.కానీ ఇక్కడ భార్య భర్తలు మాత్రం ఒకే ఇంట్లో ఉన్న కలిసి ఉండటం లేదు.
అదేదో రెండు రోజులో మూడు రోజులో అనుకుంటే పొరపాటే.ఏకంగా 30 ఏళ్ల నుంచి భార్య భర్తలు ఒకే ఇంట్లో జీవిస్తున్నప్పటికీ… ఒకరికొకరు వేరు కాపురం పెట్టి నట్లుగానే జీవిస్తున్నారు.
ఒకే ఇంట్లో ఉంటున్న అన్నీ సగం సగం పంచుకుంటున్నారు.ఈ వింత దంపతులు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.చైనాలోని తియాంజిన్ లో నివసిస్తున్న చెన్ అనే వ్యక్తికి పెళ్ళై 30 ఏళ్లు అయింది.అయితే పెళ్లి జరిగిన నాటి నుంచి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడూ కలుసుకున్నది లేదు మాట్లాడుకున్నది లేదు.
ఒకే ఇంట్లో ఉంటున్న ఒకరికొకరు తెలియదేమో అన్నట్లుగా జీవిస్తున్నారు.ఒకరి వస్తువులు ఒకరు తాకరు… అలాగే వంటలు కూడా వేరువేరు… కరెంటు బిల్లు కూడా చెరిసగం పంచుకుంటారు.
చివరికి వీరిద్దరి పడకలు కూడా వేరు వేరే .
ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా ఒకే రూమ్ లో ఉంటే అన్ని షేర్ చేసుకుంటారేమో కానీ వీళ్ళు మాత్రం ఏకంగా దాంపత్య జీవితం లో ఉండి 30 ఏళ్లుగా అసలు కలిసి బతికింది మాత్రం లేదు.ఇలా భార్య భర్తలు గా విడిపోయి ఉండే బదులు విడాకులు తీసుకోవచ్చుగా అని ప్రశ్నిస్తే వివాహ వ్యవస్థపై తమకు ఎంతో గౌరవం ఉంది… ఇలా వేరు వేరు గా ఉన్నంత మాత్రాన ప్రేమ లేదు అని ఎలా అనుకుంటారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇది దంపతులు.ఇక ఇది తెలిసిన నెటిజన్లు ఏంటో ఈ ఇద్దరి మధ్య వింతదాంపత్యం కొంచెం కూడా అర్థం కావట్లేదు అని అంటున్నారు.