చైనీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుంటే వారు తినే తిండి మనుషులు ఎవరూ తినరేమో అన్న అనుమానాలు కూడా రాకమానవు.ఇటీవల ఈ చైనా ఆహారపు అలవాట్ల వల్లే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కి లక్షల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.
రకరకాల జంవుతులు,పక్షులు,గబ్బిలాలు వంటి ఇలా తినడం వలనే చైనా లో మొదలెత్తుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంది.చైనా లోని ఈ వైరస్ అనేది మొదలైంది అని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కోవిడ్ వల్ల మృతి చెందుతున్నప్పటికీ డ్రాగన్ దేశంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.ఇంకా ఈ వైరస్ నుంచి పూర్తిగా బయటపడకుండానే డాగ్-మీట్ ఫెస్టివల్ కు సిద్ధమౌతున్నారు.
ఈ కోవిడ్ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది డాగ్-మీట్ ఫెస్టివల్ నిర్వహించడంపై విముఖత చూపినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం వినడం లేదు.ముఖ్యంగా మెయిన్ ల్యాండ్ చైనాలోని యులిన్ నగర ప్రజలు ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా డాగ్-మీట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.
ఈ ఏడాది చైనా 10 రోజుల వార్షిక వేడుకలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా దేశంలోని వేల కుక్కలను చంపేస్తున్నారు.
ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తో అల్లాడిపోతుంటే చైనా ప్రజలు మాత్రం ఈ ఫెస్టివల్ మాత్రం జరుపుకోవాల్సిందే అంటుండడం గమనార్హం.గతేడాది ఆగష్టు లోనే చైనా లో ఈ కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటికీ నవంబర్,డిసెంబర్ నెలల్లో ఉగ్రరూపం దాల్చింది.
దీనితో 75 రోజుల పాటు లాక్ డౌన్ విధించి పూర్తి స్థాయిలో ఈ వైరస్ ను నియంత్రించ గలిగారు.అయితే పూర్తి స్థాయి లో కరోనా నిర్మూలించాము అని భావించిన చైనా లో ఇటీవల మరోసారి కరోనా కేసులు బయటపడుతున్నాయి.
అయితే ఇంతగా పరిస్థితులు ఏర్పడినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఈ డాగ్-మీట్ ఉత్సవాలు మాత్రం జరిపితీరాల్సిందే అని అంటున్నారు.