ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియా పై బాలయ్య విమర్శలు..!!

నందమూరి బాలయ్య అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు టిడిపి పార్టీకి చెందిన నాయకులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.25 వ వర్ధంతి సందర్భంగా టిడిపి పార్టీకి చెందిన నాయకులు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వర్ధంతిని ఘనంగా జరిపారు.టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు పార్టీకి చెందిన కీలక నాయకుల మధ్య జరుపుకున్నారు.

Telugu Bala Krishna, Chandrababu-Telugu Political News

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి ఎన్టీఆర్ ని ఉద్దేశించి పొగడ్తల వర్షం కురిపించిన బాలయ్య తర్వాత మీడియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మేటర్ లోకి వెళ్తే మీడియా ప్రతినిధులు బాలయ్య మాట్లాడుతున్న సమయంలో మైకులు పట్టుకుని మీద మీద పడిపోయారు.దీంతో ఒక్కసారిగా అసహనం చెందిన బాలయ్య కాళ్ళ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

మీడియా ప్రతినిధి లో ఒకరు ‘మైక్ పెట్టు.మైక్ పెట్టు తమ్ముడూ’ లాంటి మాటలు విని.

‘ఎక్కడా ? మైక్ పెట్టు కాదు.మైక్ పట్టుకో అను.నీ యబ్బా’ అంటూ బాలయ్య తనదైన శైలిలో రెచ్చిపోయారు.‘కొంచెం ముందుకు రండి.

వెనక్కి వెళ్లండి సార్’ అని మీడియా సిబ్బంది వేసిన డైలాగులకు.‘చాల్ చాల్లే.

మీ సలహాలు.సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో ఉచ్చపోసే రకాలు మీరు’ అంటూ మీడియాపై ఒక్కసారిగా రెచ్చిపోయారు.

దీంతో బాలయ్య బాబు మీడియా పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube