ఆడుతూ పాడుతూ జీవనం కొనసాగించే ఎనిమిదేళ్ళ పాప కు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి.ఈ దారుణ సంఘటన తమిళనాడు లోని టుటికోరిన్ జిల్లాలో జరిగింది.
సదరు బాలిక ఇంట్లో టీవీ లేకపోవడంతో అప్పుడప్పుడు పక్కింటి వారి ఇంట్లోకి వెళ్లి టీవీ చూసేది.అయితే తాజాగా 2 రోజుల క్రితం ఆశగా టీవీ చూద్దామని వారి ఇంటికి వెళ్ళింది.
అయితే ఆ సమయానికి ఆ ఇంటి యజమాని తన తండ్రి తో ఏదో విషయంలో తీవ్రంగా గొడవ పడుతూ ఉన్నాడు.ఇది ఇలా ఉండగా ఆ చిన్నారి వచ్చి అతనిని టివి పెట్టమని అడగడంతో అతని కోపాన్ని మొత్తం ఆ చిన్నారిపై చూపించాడు.
దీంతో ఏకంగా ఆ బాలిక గొంతు కోసి, దారుణంగా హతమార్చాడు.ఆ తర్వాత చిన్నారి శవాన్ని ఓ ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టి మూత పెట్టాడు.
ఆ తర్వాత వారి ఇంటి దగ్గరే సమీపంలోని ఓ వంతెన వద్దకు వెళ్లి మృతదేహాన్ని ఆ నీటిలో పడేశాడు.అలా నీటిలో పడేస్తున్న సంఘటనను చూసిన ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ విషయంలో నిందితుడికి సహాయం చేసిన స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం అతని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలియజేశారు.
అయితే ఆ బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అన్న కోణంలో పోస్టుమార్టం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.