తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి.ఈ ఉత్సవాలలో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.