ఆన్ లైన్ మోసాలు ఎవరిని వదలడం లేదు.అగంతకులు గురిపెట్టారంటే ఎంతటి వారినైన బోల్తా కొట్టిస్తున్నారు.
తాజాగా ఒక సీయం కూతురినే మోసం చేశారంటే వారి తెలివి తేటలు, ధైర్యం ఎంత షార్ప్గా ఉన్నాయో అర్ధం చేసుకోండి.
అయ్యో సీయం కూతురే మోసపోయిందంటే మాలాంటి సామాన్య జనం పరిస్దితి ఏంటని ఆలోచిస్తున్నారా.
తప్పదు మన వ్యవస్ద అంత పటిష్టంగా ఉంది మరీ.ఇక ఎక్కడి సీయం కూతురు అని అనుమానం వస్తుందా.అక్కడికే వస్తున్నా.
దేశ రాజధాని అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుమార్తె, హర్షితా కేజ్రీవాల్, కేటుగాడి చేతిలో మోసపోయిన వనితా.ఇక హర్షిత ఆన్ లైన్ పోర్టల్ లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకుని, ఆ సమాచారాన్ని అందులో పొందుపరిచిందట.
ఆ సోఫా కోసం హర్షితను సంప్రదించిన కేటుగాడు డీల్ కుదుర్చుకుని ఆమె అకౌంట్ కు కొంత డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి హర్షితను నమ్మించాడట.ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంటులో ఉన్న రూ.34 వేలను దోచేశాడట ఈ ఆన్లైన్ చోరుడు.తాను
.