దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.వి.
రమణ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ విచ్చేశారు.హైదరాబాద్ రాక ముందు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.
అనంతరం హైదరాబాద్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ రావటంతో రాజ్ భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంతమంది మంత్రులు కలిసి ఆయనను సత్కరించారు. ఇదే రీతిలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తేనేటి విందు ఏర్పాటు చేసి ఎన్.వి.రమణ ని సత్కరించడం జరిగింది.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్.వి.రమణ పని చేయడంతో చాలా మంది న్యాయమూర్తులు ఆయనను కలిసి ప్రశంసించారు.ఇదే క్రమంలో నాటి అనుభవాలను నెమరు వేసుకుని తనని కలిసిన ప్రముఖులతో రాజకీయ నేతలతో ఎన్.వి.రమణ ముచ్చటించారు.తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి లతోపాటు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పాల్గొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ని సత్కరించారు.ఇదే రీతిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు కూడా కలిసి మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు.
.