కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న విషయం విదితమే.ఈ క్రమంలో ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
చిదంబరం కస్టడీ పొడిగించాలి అంటూ సీబీఐ విజ్ఞప్తి చేయగా దానికి అంగీకరించైనా న్యాయస్థానం ఈ నెల 17 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ క్రమంలో తనకు ఇంటి భోజనం కావలి అని కోర్టు లో చిదంబరం కోరగా దానికి కోర్టు కూడా అనుమతించింది.
ఆయనకు ఇంటి భోజనం అనుమతించాలి అంటూ జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.కానీ ఒక కండీషన్ కూడా విధించింది.
అదేంటంటే రోజుకు రెండు సార్లు ఇంటి భోజనం తినాలని అదికూడా శాఖాహారం మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది.ఈ మేరకు జైలు అధికారులకు కూడా కోర్టు స్పష్టం గా తెలిపింది.
మరోపక్క బెయిల్ కోసం కూడా చిదంబరం సుప్రీంను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం దసరా దగ్గర పడుతుండడం తో దసరాకు ముందే తన పిటిషన్ పై విచారణ జరపాలని ఈ సందర్భంగా చిదంబరం కోర్టు కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
దీనితో ఈ పిటీషన్ పై వేగవంతమైన విచారణకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.