కొందరు అవగాహన లేని వైద్యులు చేసేటువంటి తప్పిదాలకు సామాన్య ప్రజల ఆరోగ్య సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.గతంలో ఓ మహిళ చికెన్ ముక్క తింటుండగా అనుకోకుండా ఎముకను మింగేసింది.
దీంతో ఈ విషయం గురించి డాక్టర్లకు చెప్పగా సరైన అందించకపోగా ఏవో కొన్ని మందులు రాసి పంపి చేయడంతో దాదాపుగా మహిళ 14 సంవత్సరాలపాటు దగ్గుతో బాధ పడుతున్న ఘటన చైనా దేశంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే చైనా దేశ పరిసర ప్రాంతంలో ఓ యువతి నివాసం ఉంటోంది.
అయితే ఈమె ఆహారం తీసుకునే సమయంలో చికెన్ తింటుండగా అనుకోకుండా ఎముకను మింగేసింది.అయితే సాధారణంగా మనం ఏదైనా మింగితే అది సరాసరి మన పొట్టలోకి వెళుతుందని అనుకుంటాం.
కానీ ఈ యువతికి మాత్రం అలా జరగలేదు ఎముక ఏకంగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో గత 14 సంవత్సరాలుగా ఆ యువతి దగ్గు కారణంగా బాధపడుతోంది.దీంతో దగ్గు కారణంగా స్థానికంగా ఉన్నటువంటి వైద్యులని సంప్రదించేది.గత కొద్ది కాలంగా కేవలం దగ్గు కారణంగా యువతి వైద్యులను సంప్రదిస్తుండగా వైద్యులు ఆమె దగ్గుకి కారణాలేంటో కనుక్కునే ప్రయత్నంలో విఫలమయ్యారు.
దీంతో వైద్యులు ఈ విషయాన్ని దేశంలోని ప్రముఖ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లగా వారు వెంటనే యువతిశరీరం మొత్తం స్కానింగ్ నిర్వహించారు.
అయితే అనంతరం యువతీ ఊపిరి తిత్తుల్లో ఏదో ఉందని గ్రహించినటువంటి వైద్యులు వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేయడం మొదలుపెట్టారు.
దీంతో శస్త్ర చికిత్స అనంతరం ఆ వస్తువును బయటకి తీయడంతో అది 14 సంవత్సరాల క్రితం యువతి ఉన్నటువంటి చికెన్ ముక్క అని వైద్యులు కనుగొన్నారు.