మృత్యువు ఎటునుండి వస్తుందో ఎవరూ చెప్పలేరు.కొన్ని కొన్ని సార్లు ఎవరు ఊహించని విధంగానే మృత్యువు దరిచేరుతు ఉంటుంది.
అమ్మమ్మ ప్రేమ ఇక్కడ ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది.చిన్నారులకు ఎంతో ప్రేమగా అమ్మమ్మ వండి పెట్టిన చికెన్ తిని ప్రాణాలు వదిలారు.
ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం లో జరిగింది.
మండలంలోని బ్రాహ్మణపల్లి కి చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు.
దీంతో తన మనవళ్లు వచ్చారని ఎంతో ప్రేమతో వారికి చికెన్ చేసి పెట్టాలి అనుకుంది అమ్మమ్మ.అయితే గత కొంతకాలంగా మతిస్థిమితం తో బాధపడుతున్న అమ్మమ్మ చికెన్ చేస్తున్న క్రమంలో మసాలా కు బదులుగా ఏకంగా విషగుళికలు మందులు వేసింది.
దీంతో చికెన్ కాస్త ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యువు గా మారిపోయింది.
అమ్మమ్మ వండిన చికెన్ ని హాయిగా ఆరగిద్దామనుకున్నారు.ఎంతో సంతోషంగా చికెన్ తిన్నారు.కానీ చివరికి ప్రాణాలు కోల్పోయారు ఆ చిన్నారులు.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మ వండిన చికెన్ వంటకం కారణంగానే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.