మనలో చాలామంది చికెన్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తింటారు.చికెన్ తినకపోతే ముద్ద దిగనివారు మనలో చాలామందే ఉంటారు.
హోటళ్లలో, ఫుడ్ వెబ్ సైట్లలో తక్కువ ధరకే చికెన్ బిర్యానీ ఇస్తే కొనుగోలు చేసేవాళ్లు ఎంతోమంది ఉంటారు.తాజాగా చెన్నైలోని రామనాథపురంలో ఐదు పైసలకే చికెన్ బిర్యానీ అనే బ్రహ్మాండమైన ఆఫర్ పెట్టారు.
దీంతో భోజనప్రియులు ఆ హోటల్ ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు.
పనైకుళం, కీళక్కరై, రామనాథపురం ప్రాంతాలు చికెన్, మటన్ బిర్యానీ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి.
రామనాథపురంలో ఫరత్ అనే వ్యక్తి కొత్తగా బిర్యానీ సెంటర్ ను ప్రారంభించాడు.పోటీ ఎక్కువగా ఉండటంతో జనాలను ఆకర్షించాలనే ఉద్దేశంతో 5 పైసలకే చికెన్ బిర్యానీ అనే ఆఫర్ ను ప్రవేశపెట్టాడు.
ఫరత్ బిర్యానీ సెంటర్ లో చికెన్ బిర్యానీతో పాటు వంకాయ కూర్మ, పెరుగు పచ్చడి అందించడం గమనార్హం.
అయితే 5 పైసలు ప్రస్తుతం చెల్లడం లేదు కదా….? 5 పైసలకే బిర్యానీ ఎలా విక్రయిస్తున్నారు అనే సందేహం కలుగుతోందా….? ఫరత్ కేవలం ఎవరైతే పాత 5 పైసల నాణేలను కలిగి ఉంటారో వారికి మాత్రమే చికెన్ బిర్యానీనీ అందిస్తున్నాడు.ఈ ఆఫర్ గురించి ఫరత్ మాట్లాడుతూ ఇలా అందించడం వల్ల హోటల్ పట్ల జనాలు ఆకర్షితులు కావడంతో పాటు పాత నాణేల పట్ల ప్రజల్లో ఆసక్తి కలుగుతుందని చెప్పాడు.ఇప్పటివరకు 150 మంది పైగా ప్రజలు 5 పైసల నాణెం చెల్లించి బిర్యానీని కొనుగోలు చేశారని చెప్పాడు.5 పైసల నాణేలు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపిస్తుంటే నాణేలు లేని వాళ్లు మాత్రం తమకు కూడా ఈ ఆఫర్ కల్పిస్తే బాగుంటుందని చెబుతున్నారు.