మెరుగుపడని ఆరోగ్యం, కరోనా కు బలైన యూపీ మంత్రి!

యూపీ యోగి ఆదిత్య నాథ్ సర్కార్ లో మరో మంత్రి కరోనా కు బలై పోయారు.మాజీ టీమిండియా ఓపెనర్,యూపీ మంత్రి చేతన్ చౌహన్(73) కూడా కరోనాకు బలైపోయారు.

 Up Minister And Former Cricketer Passes Away With Corona , Chetan Chauhan, Up, Y-TeluguStop.com

కొద్దీ రోజుల క్రితమే యూపీ కి చెందిన మంత్రి కమలా రాణి కరోనా కారణంగానే బలైన విషయం తెలిసిందే.ఇంకా ఆ ఘటన మరువక ముందే యోగి సర్కార్ లో మరో మంత్రి ఇదే మహమ్మారికి బలై పోవడం కలకలం రేపుతోంది.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి సామాన్యుల తో పాటు ప్రజా ప్రతినిధులను,సెల్రబిటీలను సైతం వదలడం లేదు.ఈ మహమ్మారి కి తట్టుకోలేక కొందరు ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ కోవలోకే చేతన్ చోహన్ చేరారు.కరోనా సోకి ఆయన గత కొద్దీ రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

చేతన్ చౌహన్ జూలై 12న కరోనా వైరస్ బారిన పడ్డారు.దీంతో ఆయనను లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా మరింత క్షీణించింది.దీనితో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత హాస్పటల్ కు తరలించారు.

అయితే ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు హై బీపీ,కిడ్నీ వంటివి కూడా ఉండడం తో ఆయన ఈ మహమ్మారిని జయించడం లో విఫలమయ్యారు.దీనితో వెంటిలేటర్ పై చికిత్స అందించేందుకు ప్రయతించినా ఫలితం లేకుండా పోయింది.

చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.టీమిండియా తరపున పలు టెస్ట్ లు ,వన్డే మ్యాచ్ లు ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి నేతగా ఎదిగి ఇప్పుడు యూపీ యోగి క్యాబినెట్ లో మంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన చివరికి ప్రాణాలు పోగుట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube