చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ గత నెల వచ్చింది.
కానీ ఆ వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు.అయితే కరోనా వైరస్ కి పూర్తిస్థాయిలో ఎప్పుడు వస్తుందో తెలీదు.
కానీ ఈ వైరస్ లో మాత్రం రోజుకు ఒకటి బయటకు వస్తుంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ప్రతిరోజు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.ఇప్పుడు కరోనా వైరస్ లక్షణాల్లో మరొకటి బయటపడింది.
కరోనా వచ్చిన వారిలో ఎక్కువగా జలుబు, దగ్గు ఇంకా శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు.అంతేకాకుండా తీవ్ర జ్వరం, తలనొప్పి, రుచి తెలియకపోవడం, వాసనను పసిగట్టలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
అయితే ఇప్పుడు తాజాగా చాతిలో నొప్పి ఎక్కువగా ఉంటే కూడా కరోనా ఇరుసు లక్షణమే అని ప్రచారం జరుగుతోంది.ఇది ఎంతవరకు నిజం అన్నది రుజువు కావాల్సి ఉంది.
కరోనా లక్షణాలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.దగ్గు ఒకటి కాబట్టి, మనం ఎక్కువగా దగ్గుతున్నప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల వల్ల చాతిలో నొప్పిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఎక్కువ గాఢత కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఛాతిలో నొప్పిగా ఉంటుంది.
అంతేకాని ఛాతి నొప్పి కరోనా లక్షణం కాదని, కరోనా వైరస్ కారణంగా ఛాతిలో నొప్పి రాదని ఇది అంత ప్రభావవంతమైన లక్షణం కాదని వైద్యులు పేర్కొన్నారు.చాతిలో నొప్పి గా ఉంటే కరోనా అని భయపడవలసిన పనిలేదని, ధైర్యంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.