రోడ్ మీద ఏదైనా కుక్క కనిపిస్తే ఏం చేస్తాం .? ఛీ ఛీ అంటూ చీదరించుకుంటూ వెళ్ళిపోతాం.అయితే అటువంటి కుక్క మాంసం గురించి చెప్తే వాంతి వచ్చినంత పనవుతుంది.కానీ తమిళనాడులో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.ఓ పార్శిల్ లో దాదాపు 2000 కిలోల కుక్కమాంసం బయటపడింది.ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఫుడ్ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు.అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు.దాదాపు 2000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్కు తీసుకువెళ్లారు.
రాజస్తాన్ రాష్ట్రం జోథ్పూర్ నుంచి ఈ మాంసాన్ని ఐస్ పెట్టెల్లో ఉంచి తీసుకు రాగా, ఆ పెట్టెలపై ఉన్న చిరునామా ఆధా రంగా నగర పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటన మాంసాహార ప్రియులను హడలెత్తించింది.అంతే కాకుండా బిరియాని విక్రయాలు కూడా పడిపోయాయి.
ఈ నేపథ్యంలో గురువారం చెన్నై పశుసంవర్థక శాఖ వైద్య అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్నది కుక్క మాంసం కాదని, మేక మాంసమేనని తమ పరిశోధనల్లో తేలిందన్నారు.ఈ మాంసం గడువు ముగిసిన అనంతరం రాష్ట్రానికి చేరడం వల్లే ఈ అనుమానం వచ్చిందని వారు తెలిపారు.