ఈ మధ్యకాలంలో చిన్న గొడవలను కూడా పెద్దగా చూసి ప్రాణాలు తీసుకుంటున్నారు.చిన్న మాటతో మొదలైన గొడవ మాటామాటా పెరిగి హత్యలు చేసుకుంటున్న ఘటనలను మనం ఎక్కువగానే చూస్తున్నాం.
ఇంకా అచ్చం అలాంటి ఘటనే చైన్నెలో చోటు చేసుకుంది.అయితే ఈ ఘటనలో ఎవరు ఎవరిని చంపుకోకపోయినప్పటికీ ఘటన గురించి తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.
ఎందుకంటే ఇది ఓ దిక్కుమాలిన పని కాబట్టి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.కారు పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తి పొరిగింటి వ్యక్తితో గొడవ పడ్డాడు.ఇంకా ఆ గొడవ పెరిగిపోయింది.
దీంతో అతడిపై ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు.ఇప్పుడు ఆ రివెంజ్ ఏ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.గొడవ పడిన ఆ వ్యక్తి ఇంటి గుమ్మం తలుపుపై మూత్రం పోశాడు.
ఇంకా ఇది అంత ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యింది.చిన్నలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇప్పుడు పెద్ద రాద్దాంతమే జరుగుతుంది.
ఎందుకంటే మూత్రం పోసిన వ్యక్తి అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ సభ్యుడు.
దీంతో ఇదే ఛాన్స్ అని.కాంగ్రెస్ నేతలు.ఈ వీడియోను వైరల్ చేశారు.
బాధ్యతాయుతంగా ఉండాల్సిన విద్యార్థి నేత ఇలాంటి సిగ్గుమాలిన పని చేస్తాడా అంటూ విమర్శలు చేస్తున్నారు.ఇంకా ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మరి మీరు ఆ వీడియోను ఓసారి చూసేయండి.