తమిళనాడులోని చెన్నై వ్యాపారి ఒకరు నిజమైన దీపావళికి నిర్వచనం తెలియజేశాడు.ఉన్నవారే కాకుండా లేనివారు కూడా దీపావళి పండుగను సంతోషంగా చేసుకోవాలని ఓ చెన్నైవాసి కోరుకున్నాడు.
దీంతో అతడు ఓ వినూత్న ప్రయత్నం చేశాడు.ఇప్పుడు అతడి ప్రయత్నం గురించి సర్వత్రా చర్చ సాగుతోంది.
ఇంతకీ అతడు ఏం చేశాడనుకుంటున్నారా.పేదవారు కూడా ధనికుల వలే ఖరీదైన దుస్తులు ధరించుకుని దీపావళి పండగ జరుపుకోవాలని అతడు కోరుకున్నాడు.దీంతో పేదల కోసం ఒక చొక్కాను రూ.1కి, నైటీని రూ.10కి అందజేశాడు.తొలుత ఈ ఆఫర్ను ముందు వచ్చిన 50 మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా.
రద్దీ పెరగడంతో 200 మందికి టోకెన్లు ఇస్తూ వచ్చాడు.దీపావళి సందర్బంగా ఈ నెల 19 నుండి 26వ తేదీ వరకు ఈ ఆఫర్ను అమలు చేశాడు.
పేదలకోసం తాను చేసిన ఈ ప్రయత్నం వారి ఇంట సంతోషాన్ని పండిస్తే చాలని అతడు కోరుకున్నాడు.కాగా పూర్తిగా ఉచితంగా ఇస్తే దానికి విలువ ఉండదని భావించిన అతడు తక్కువ మొత్తానికి వాటిని విక్రయించాడు.
దీంతో నిజమైన దీపావళికి నిర్వచనం చెప్పాడంటూ అతడిని పలువురు ప్రశంసిస్తున్నారు.