ఇటీవల కాలంలో జంతువుల యుద్ధంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.నిన్నటికి నిన్న ఆధిపత్య పోరులో పాములు యుద్ధం చేసుకుంటే ఇప్పుడు ఒక
ముళ్ళపంది, చిరుత యుద్ధం
కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగానే యుద్ధంలో ఎవరు బలవంతుడు అయితే వారు గెలుస్తారు.అందుకే ముళ్ళపందిపై చిరుత గెలుస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది.ముళ్ళపంది ఎంతో తెలివిగా తన మూళ్ళ కవచాన్ని ఉపయోగించి చిరుతని పరిగెత్తించింది.
దీంతో చిరుత ఓడిపోయి వెనుదిరగగా ముళ్ళపంది మాత్రం గెలిచి సురక్షితంగా వెళ్లిపోయింది.
ఇంకా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా వైరల్ గా మారింది.
ముళ్ళపంది ధైర్యాన్ని చూసి ప్రతి మనిషికి ఏదో ఒక రక్షణ కవచం ఉంటుంది దాన్ని శక్తివంతంగా మార్చుకొని తమ వైపు నుంచి ప్రయత్నం చేస్తే కచ్చితంగా గెలుస్తారని అంటూ ఆ వీడియో చుసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.