కన్నుగీటి భామ ప్రియా వారియర్ పరిచయం అందరికి తెలిసిందే.ఒక్క కన్నుగీటి తో దేశవ్యాప్తంగా అభిమానులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ బ్యూటీ ‘ఒరు ఆదార్ లవ్‘ అనే మలయాళం సినిమా తో ఎంత మంది అభిమానుల హృదయాలను తాకింది.ఇక ఆ ఒక్క సీన్ తో ఎంతో మాయ చేసిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేదు.
దీంతో తనకు మళ్లీ మలయాళంలో అవకాశాలు రాకపోవడంతో మొత్తానికి టాలీవుడ్ లో అడుగు పెట్టేసింది.
టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా కూడా అనుకున్నంత క్రేజ్ ఇవ్వలేకపోయింది.దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో కూడా తొలి సినిమా కూడా నిరాశ పరిచింది.
ఇక మళ్లీ ఈ సినిమా తర్వాత అవకాశాలు రాదనుకున్న ఈ అమ్మడికి మొత్తానికి మరో సినిమా ఇష్క్ లో అవకాశం వచ్చింది.
తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా ఇష్క్ లో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా విడుదల చేయడానికి డేట్ కూడా ప్రకటించారు.కానీ అంతలోనే కరోనా సెకండ్ వేవ్ వ్యాపించడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడగా మళ్ళీ ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత విడుదల చేయనున్నట్లు సినీ బృందం తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి బహుశా ఈ సినిమాతో కెరీర్ చెక్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటివరకు తాను తెలుగులో మరో సినిమా ఒప్పుకున్నట్లు కూడా ఎటువంటి సమాచారం లేదు.పైగా ఈమె కోసం ఏ దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనలో కూడా లేరని కనిపిస్తుంది.
కేవలం హిందీ, కన్నడ సినిమాలలో మాత్రం అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.