పాల్ పై చీటింగ్ కేసు నమోదు చేసిన మహిళ

నిత్యం సూక్తులు వల్లించే మత ప్రచారకుడు,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది.ఒక మహిళను చీటింగ్ చేసాడు అన్న నేపథ్యంలో పాల్ పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 Cheating Case Registered Against K A Pal-TeluguStop.com

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన సత్యవతి అనే మహిళకు అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా,స్పాన్సర్ షిప్ లెటర్ ఇస్తానని ఆశ చూపి డబ్బులు తీసుకున్నట్లు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.వాస్తవానికి ఆ మహిళను రూ.15 లక్షలు డిమాండ్ చేశారని, ఈ క్రమంలో ఈ నెల 8 వ తారీఖున 2 లక్షలకు చెక్ ని అందించగా,డబ్బులు కూడా డ్రా చేసుకున్న ఆయన ఎలాంటి స్పాన్సర్ షిప్ లెటర్ అందించలేదని ఆ మహిళ ఆరోపించింది.

-Telugu Political News

దీనితో ఏమి చేయాలో తోచక పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టినట్లు ఆమె తెలిపారు.సత్యవతి ఫిర్యాదు తో పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్ ఆయన సన్నిహితులు విజయ్,జ్యోతి లపై కూడా చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది.దీనికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పాల్ ప్రజాశాంతి పేరుతొ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.అయితే ఆ పార్టీ కి అతి తక్కువ ఓట్లు దక్కడమే కాకుండా డిపాజిట్లు కూడా పొందలేకపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube