నిత్య పెళ్లి కొడుకు అంటూ మనం తరచు వార్తల్లో చూస్తూనే ఉంటాం.అయితే నిత్య పెళ్లి కూతురు గురించి మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఈమద్య కాలంలో పెరిగిన టెక్నాలజీ మరియు సాంకేతిక పద్దతుల కారణంగా అమ్మాయిలు నిత్య పెళ్లి కూతుర్ల అవతారం ఎత్తుతున్నారు.ఎంతో మంది అబ్బాయిల జీవితాలను నాశనం చేసేందుకు పెళ్లి కూతుర్ల రూపంలో దాపరిస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని బుందేల్ ఖండ్ ప్రాంతంలలో ఒక సీరియల్ పెళ్లి కూతురును పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ పెళ్లి కూతురు కూపీ లాగితే డొంక అంతా కదిలింది.
అంతా కూడా ఆశ్చర్యపో విధంగా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్వప్న అనే యువతి చాలా రోజులుగా వరుసగా పెళ్లిలు చేసుకుంటూ వస్తోంది.తాజాగా ఛత్తార్పూర్ గ్రామానికి చెందిన సునీల్ గుప్త అనే వ్యక్తితో స్వప్న పరిచయం ఏర్పర్చుకుంది.ఆ పరిచయంను పెళ్లి వరకు తీసుకు వెళ్లింది.
తనకు తల్లిదండ్రి లేరు అని, రాహుల్ అనే ఒకే ఒక్క అన్నయ్య ఉన్నాడు అంటూ నమ్మబలికింది.రాహుల్ను పరిచయం చేసింది.
ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అంటూ సునీల్ గుప్త సమక్షంలో రాహుల్కు చెప్పింది.మొదట నో అన్నట్లుగా చెప్పిన రాహుల్ ఆ తర్వాత ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడు.
ఆ తర్వాత అమ్మాయి తరపున పెళ్లి ఏర్పాట్లకు లక్ష సాయం కావాలంటూ సునీల్ ను రాహల్ అడగడం, ఆయన స్వప్నపై మోజుతో ఇవ్వడం జరిగింది.
పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.
మార్చి 4న పెళ్లి జరిగింది.పెళ్లి జరిగిన రాత్రి, ఆ తర్వాత రాత్రి ఉన్నారు.
మార్చి 5వ తారీకు రాత్రి ఇంట్లో ఉన్న బంగారం మరియు నగదు, ఇతర విలువైన వస్తువులను తీసుకుని స్వప్న మరియు రాహుల్ లు హుడాయించారు.దాంతో వారం రోజుల పాటు వెదికిన సునీల్ గుప్త ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
పోలీసులు కేసును లోతుగా ఎంక్వౌరీ చేయడంతో స్వప్న బాధితులు మరికొందరు కనిపించారు.అలా స్వప్నను అరెస్ట్ చేసి పోలీసులు కస్టడీకి పంపించారు.ఆమెను విచారించగా తమ బృందం మొత్తం నలుగురు అని చెప్పింది.ఆ నలుగురు కూడా అరెస్ట్ అయ్యారు.సునీల్ గుప్తకు ముందు స్వప్నను పెళ్లి చేసుకున్న వారు పరువు పోతుందనే ఉద్దేశ్యంతో బయటకు రాలేదట.సునీల్ గుప్త కూడా పోలీసులను ఆశ్రయించకుంటే మరెంత మందిని మోసం చేసేదో ఈ కిలాడీ పెళ్లి కూతురు.