ఈరోజు 2020 సంవత్సరంలో జరుగునున్న ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్ళ కోసం ఈ రోజు కలకత్తా నగరంలో వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో భారత్ వెటరన్ స్పెషలిస్ట్ ఓపెనర్ రాబిన్ ఊతప్ప జాక్ పాట్ కొట్టాడు.
తను అనుకున్న దానికంటే రెండు రెట్లు డబ్బులు వెచ్చించి రాజస్థాన్ జట్టు అతడిని సొంతం చేసుకుంది.
ఈ సారి వేలంలో రాబిన్ తన రేటు నీ 1.5కోట్లు నిర్ధారించుకున్నాడు.అయితే అతడి కోసం వచ్చిన ప్రాంచైజీలు తన కోసం పోటీ పడుతూ ఒక్కసారిగా రేటుని అమాంతం పెంచేశాయి.
దీంతో చివరికి రాజస్థాన్ జట్టు ఏకంగా 3కోట్ల రూపాయలు వెచ్చించి ఉతప్పని సొంతం చేసుకుంది.
అలాగే విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ని పంజాబ్ జట్టు ఈ సారి కూడా అలానే అంటిపెట్టుకుంది.అయితే దీనికోసం పంజాబ్ ఏకంగా 10.75 కోట్లు చెల్లించింది.అయితే ఇది ఇలా ఉండగా తెలుగు ప్లేయర్ హనుమ విహారి, చతేశ్వర్ పుజారా లను కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈసారి వారికి నిరాశ తప్పలేదు.
.