టాలీవుడ్ ను కొన్నాళ్ల క్రితం కుదిపేసింది డ్రగ్స్ కేసు.సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇంకా ప్రముఖుల పిల్లలు ఈ కేసులో బయట పడబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ కేసులో భాగంగా రవితేజ, పూరి జగన్నాధ్, ఛార్మి, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి కొందరిని విచారించిన విషయం తెల్సిందే.డ్రగ్స్ కేసును సిట్ కు అప్పగించిన నేపథ్యంలో వారు పలు దఫాలుగా విచారణ జరిపించారు.
సెలబ్రెటీల కేసు అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం అప్పట్లో సంచలనం అయ్యింది.ఈ కేసులో తన పేరు రావడంపై ఛార్మి ఇప్పటి వరకు నోరు మెదపలేదు.
ఎట్టకేలకు ఆమె డ్రగ్స్ కేసుపై స్పందించింది.
తాజాగా పుట్టిన రోజు సందర్బంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది.
డ్రగ్స్ కేసు అనేది నా జీవితంలో అత్యంత చెత్త సంఘటన.ఆ కేసులో నా పేరు రావడం వల్ల నాతో పాటు నా కుటుంబ సభ్యులు సన్నిహితులు మిత్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని నెలల పాటు ఏం చేయాలో పాలుపోక డిప్రెషన్కు వెళ్లి పోయాను.అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదని నా కుటుంబ సభ్యులు నమ్మి నా వెన్నంటి నిలిచారు.
ఆ సమయంలో వారి పూర్తి సహాయం నాకు దక్కిందని ఈ సందర్బంగా ఛార్మి చెప్పుకొచ్చింది.డ్రగ్స్ కేసులో నా పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, అయితే ఆ కేసు నుండి నేను క్లీన్ చీట్ పొందుతాను అని మాత్రం చెప్పగలను.
ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా నిర్మాణంపైనే ఉందని, నటిగా, ఐటెం సాంగ్స్ కు ఆఫర్లు వస్తున్నాయి.కాని నిర్మాతగా సెటిల్ అవ్వాలనుకుని నటనకు గుడ్ బై చెప్పినట్లుగా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తాను ఇస్మార్ట్ శంకర్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.త్వరలోనే మరిన్ని సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను అంది.ఇక ఇదే సమయంలో పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుండి కూడా పెళ్లి గురించి అడుగుతున్నారు.కాని నాకు మాత్రం పెళ్లి పై ఏమాత్రం ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చేసింది.
మళ్లీ నటించాలనే ఆలోచన అస్సలు లేదని చెబుతున్న ఛార్మి నిర్మాతగా సెటిల్ అవ్వాలనుకుంటుందట.