హిట్స్ లేకపోయినా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా ఛార్మి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.ఇక యాక్టింగ్ కెరీర్ ను పక్కనెట్టి కో ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది.
ఇన్ని రోజులు నష్టాలతో తల్లడిల్లిన అమ్మడు మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లాభాలను అందుకుంది.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ 30కోట్లకు పైగా షేర్స్ తో అటు బయ్యర్లను ఇటు నిర్మాతలను హ్యాపీ చేసింది.జ్యోతి లక్ష్మీ సినిమా నుంచి పూరి జగన్నాథ్ తో ట్రావెల్ చేస్తోన్న ఛార్మి ప్రతిసారి పూరి సినిమాల్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది.రోగ్ – పైసా వసూల్ – మెహబూబా సినిమాల్లో అమ్మడు బాగానే ఇన్వెస్ట్ చేసింది.
ఆ సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టడంతో మళ్ళీ కొలుకోలేదేమో అని కామెంట్స్ వచ్చాయి.ఫైనల్ గా మరోసారి పూరీని నమ్మి ఇస్మార్ట్ శంకర్ కు కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది.
సినిమాకు మంచి లాభాలు దక్కడమే కాకుండా ఛార్మికి మంచి గుర్తింపు కూడా తెచ్చింది.దీంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలకు కూడా పని చేస్తే బావుంటుందని ఆఫర్స్ ఇస్తున్నారట.
కానీ ఛార్మి మాత్రం పూరి కాంపౌండ్ నుంచి ఇప్పట్లో బయటకు వెళ్లేలా లేదనిపిస్తోంది.