కరోనా బెస్ట్ ఆఫ్ లుక్ అన్న చార్మి! వెంటనే క్షమాపణలు

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ప్రొడ్యూసర్ అయిన చార్మీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.ఈ ఎక్కువగా పూరీ సినిమాల బాద్యతలు చూసుకుంటూ నిర్మాతగా నాలుగు డబ్బులు సంపాదించుకునే పనిలో పడ్డ చార్మి ఆ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కొని చాలా విమర్శలు ఎదుర్కొంది.

 Charmi All The Best To Corona Virus Tweet-TeluguStop.com

ఆమెతో పాటు ఆమె పార్టనర్ పూరి జగన్నాథ్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు.ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమా అంటే కచ్చితంగా ఛార్మి నిర్మాణ భాగస్వామిగా ఉంటుంది అనేది టాలీవుడ్ లో అందరికి తెలిసిన విషయం.

ఇదిలా ఉంటే ఇండియాలో కరోనా వైరస్ ప్రవేశించిందని, అది కూడా హైదరాబాద్ లో కరోనా కేసు నమోదైంది అనేది బయటకి వచ్చింది.ఈ విషయాన్ని ఎవరో ఆమెతో షేర్ చేయడంతో కరోనా వైరస్ హైదరాబాద్ లోకి వచ్చిందంటా ఆల్ దీ బెస్ట్ అంటూ ఏటకారంగా టిక్ టాక్ వీడియోతో కామెంట్స్ చేసింది.

ఈ కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఒక ప్రమాదకర వైరస్ ఇండియాలోకి వచ్చిందని టెన్షన్ పడుతుంటే ఇలా ఏటకారంగా ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తావా అంటూ నెటిజన్లు ఆమెకి ట్వీట్ లు చేసి విమర్శించారు.

దీంతో వాస్తవం అర్ధం చేసుకున్న ఆమె మొదటి వీడియోని డిలేట్ చేసి వెంటనే మరో వీడియో అపోల్ద్ చేసి ఇలాంటి సున్నితమైన అంశంపై నేను అలా మాట్లాడటం తప్పు.మీరు పోస్ట్ చేసిన కామెంట్స్ అన్ని చదివాను, నేను ఎంత ఫూలిష్ గా మాట్లాడానో అర్ధమైంది.

అందుకే తన చర్యలపై క్షమాపణలు చెబుతున్న అంటూ మరో వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేసింది.అయితే ముందు నోటి దూలతో అనడం ఎందుకు తరువాత తిట్టించుకొని సారీ చెప్పడం ఎందుకు అనే కామెంట్స్ ఈ వీడియోపై నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube