టాలీవుడ్ లో రాక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ తన హవా కొనసాగిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాలు సంఖ్య తగ్గించిన కూడా అతని చేతిలో ఎకంగా అరడజను సినిమాల వరకు ఉన్నాయి.వాటిలో పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీ కూడా ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు విదేశాలలో మ్యూజికల్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా మారే టైం వచ్చేసిందనే మాట వినిపిస్తుంది.గతంలో సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో రాక్ స్టార్ టైటిల్ తో ఒక సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు.
మ్యూజికల్ ఎంటర్టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అప్పట్లో సుకుమార్ భావించారు.
అయితే ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ని సుకుమార్ పక్కన పెట్టి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రెండు వరుస హిట్స్ కొట్టాడు.ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్నాడు.అయితే దేవిశ్రీతో హీరోగా సినిమా చేయకున్న సుకుమార్ తన సినిమాలకి అతన్ని తప్ప మరొక వ్యక్తిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని హీరోని చేసే బాద్యతని ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పుడు నిర్మాత చార్మి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన చార్మి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాని నిర్మిస్తుంది.
తన ప్రయాణం నిర్మాతగానే ఇకపై కొనసాగిస్తా అని గతంలో చార్మి పేర్కొంది.ఇదిలా ఉంటే ఓ హర్రర్ థ్రిల్లర్ కథ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని ఆమె సంప్రదించినట్లు తెలుస్తుంది.
చార్మితో ఉన్న అనుబంధం కొద్ది అతను కూడా హీరోగా నటించడానికి ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది.