చిన్న వయసులోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మి కౌర్. ఈమె హాట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.
గత కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలోకి పూరీ జగన్నాథ్ తో కలిసి అడుగు పెట్టింది.తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ పై ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
నిన్న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ లో ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఛార్మి కూడా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విష్ చేస్తూ ఆయన గురించి ఒక్క మాటలో తెలిపారు.ఆయన పట్ల ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసారు ఆ పిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఆమె పోస్ట్ చేస్తూ. నీ గురించి ఒక్క లైన్ లో అని.నువ్వు 26 క్యారెట్ల బంగారం అని షేర్ చేసింది.
ఆమె చేసిన ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఛార్మి నిర్మాణంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని చాలా శ్రమిస్తున్నాడు.
పూరీ కూడా అదే టార్గెట్ తో విజయ్ ను కొత్తగా ప్రెసెంట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు.
లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమా కోసం విజయ్ స్పెయిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.విజయ్ పుట్టిన రోజు కానుకగా టీజర్ విడుదల అవ్వబోతుందని ఆశించిన ఫ్యాన్స్ కు.ఎలాంటి టీజర్ విడుదల అవ్వకపోవడంతో నిరాశే ఎదురైంది.