మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.దీని తర్వాత కొరటాల ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
ఇందులో రామ్ చరణ్ చేసేది గెస్ట్ అపీరియన్స్ పాత్ర అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి చాలా కాలంగా ఆసక్తికర చర్చ నడుస్తుంది.
చాలా మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే వీటిపై కూడా ఒక స్పష్టత రాలేదు.
ఆ మధ్య వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడని టాక్ వినిపించింది.
ఇదిలా ఉంటే వెంకీ కథని కూడా రామ్ చరణ్ రిజక్ట్ చేసినట్లు తాజాగా టాక్ వినిపిస్తుంది.
ఇప్పుడు తమిళ్ దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది.తమిళంలో రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ సినిమాని తెరకెక్కిచిన మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడని తెలుస్తుంది.
రీసెంట్ గా మోహన్ రాజా కథ చెప్పడం జరిగిందని, అది చరణ్ కి కూడా నచ్చడంతో ఆ కథని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.ఆర్ఆర్ఆర్ తర్వాత తనకి కూడా యూనివర్శల్ మార్కెట్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే పాన్ ఇండియా సినిమాలే చేయాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యి మోహన్ రాజా కథకి ఒకే చెప్పాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.