రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
చరణ్ పాత్ర దాదాపు 30 నిముషాల పాటు ఉండబోతుందని సమాచారం.ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య సినిమా షూటింగ్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో తనకు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
తండ్రి, కొడుకు ఒకే స్క్రీన్ లో కనిపించబోతున్నారనే తెలిసి మెగా ఫ్యాన్స్ ఖుషీఖుషీగా ఉన్నారు.
వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ అవ్వనున్నాయట.ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మార్చి 15 తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమా నుండి ఫ్రీ అవ్వనున్నాడు.ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు 20 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఆచార్య షూటింగ్ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమా క్లైమాక్స్ ప్రస్తుతం ఆర్ ఎఫ్ సి లో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్య వేక్షణలో జరుగుతుంది.పైగా రామ్ చరణ్, ఆలియా భట్ పై ఒక రొమాంటిక్ సాంగ్ తెరకెక్కించబోతున్నారు.
ఈ సాంగ్ కోసం దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ సెట్ వేశారు.
ఇది ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే బిగ్గెస్ట్ మూవీ లో నటించబోతున్నాడని మనందరికీ తెలిసిన విషయమే.అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరొక గాసిప్ గురించి ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.అయితే ఈ సినిమాలో కొరియన్ భామను తీసుకుంటున్నారని గాసిప్ మొదలయ్యింది.
ఈ గాసిప్ ఎప్పుడు ఎలా మొదలయ్యిందో తెలియదు కానీ ఈ విషయం గురించి మాత్రం రచ్చ జరుగుతుందనే చెప్పాలి.ఈ న్యూస్ గురించి అక్కడ లోకల్ ఛానెల్స్ తో పాటు కోలీవుడ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా కోసం కొరియన్ నటి బీ సుజీ ను తీసుకుంటున్నారని గట్టిగా వినపడుతున్న మాట.అయితే ఈ విషయంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.