రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.గత మూడు సంవత్సరాలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమా కోసం రాత్రిపగలు కష్టపడుతున్నారు.
ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని రాజమౌళి బందిఖానా నుండి విముక్తి పొందారు.దీంతో ఈ స్టార్స్ ఇద్దరు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ విషయంలో చరణ్ తారక్ కంటే కాస్త ముందు ఉన్నాడు.చరణ్ అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూనే ఇటు తండ్రి సినిమా ఆచార్య లో కూడా కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.
దీంతో పాటు ఇప్పుడు శంకర్ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లబోతున్నాడు.
సెప్టెంబర్ 8న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చెయ్యబోతున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ కు జోడీగా నటిస్తుంది.
ఈ సినిమా పూర్తి అయినా వెంటనే సుజిత్ లేదా గౌతమ్ తిన్ననూరి లలో ఎవరో ఒకరితో సినిమా చేయబోతున్నాడని టాక్.
అయితే ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన సినిమాల గురించి ప్రకటించాడు.ఈ సినిమా పూర్తి అయ్యింది కాబట్టి వెంటనే కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాడు.అయితే ఈ సినిమా అక్టోబర్ వరకు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
ఎందుకంటే కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి పూర్తి అయినా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయదనాయికి కమిట్ అయ్యాడు.
ఏదిఏమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతారు.అందుకే అన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతూ ఆ స్టార్ డమ్ ను కాపాడుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే ప్రెసెంట్ మాత్రం తారక్ కంటే చరణ్ కొద్దిగా ముందు వరుసలో ఉన్నాడు.