తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి నుండే ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు.టీఆర్ఎస్ లో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థులు కావచ్చు, బలంగా ఉన్న నియోజకవర్గాలు, బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు ఏవి, అక్కడ అభ్యర్థులను మార్చాలా ప్రస్తుత అభ్యర్థులనే కొనసాగించాలా అనే దానిపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.
అందుకే అసంతృప్తి నేతలు ఇప్పటి నుండే తన దారిని వెతుక్కుంటున్నారని అటువంటి నేతలనే బీజేపీ సంప్రదించడం కానీ, సదరు నేతలే బీజేపీని సంప్రదించడం కానీ చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కెటీఆర్ ఇంకా పార్టీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభించలేదు కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు అసత్యమని మరికొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియానే పెద్ద ఎత్తున కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.అయితే బీజేపీతో పోలిస్తే సోషల్ మీడియా పరంగా టీఆర్ఎస్ కాస్త వెనుకబడి ఉన్న మాట వాస్తవం.టీఆర్ఎస్ మాత్రం సోషల్ మీడియా పరంగా మాత్రం దృష్టి పెట్టకపోతే కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురైనా ఆశ్చర్య పోనక్కరలేదు.అయితే ఇటీవల కెసీఆర్ అన్నట్టు అధికారికంగా ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశం ఉంది .ఇక అప్పుడు ప్రజలు ఆలోచనల ఆధారంగా గెలుపోటములు అనేవి నిర్ధారించబడతాయి.టీఆర్ఎస్ మాత్రం పార్టీ నుండి బయటికి వెళ్తున్న నేతల పరిణామాలను పెద్దగా సీరియస్ గా తీసుకొంటున్న పరిస్థితి లేదు.
మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని ఎలా మార్చుకుంటుందనేది చూడాల్సి ఉంది.