యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా, ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేశాడు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.దీంతో ఇప్పుడు మరోసారి తారక్తో కలిసి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్టును కూడా పర్ఫెక్ట్గా ఉండేలా కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఇప్పటికే ఈ స్క్రిప్టును పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు అందులో పలు మార్పులు చేస్తున్నాడట.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా కథలో మార్పులు చేస్తున్నాడట కొరటాల.
దీంతో తారక్-కొరటాల కాంబోలో రాబోయే సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ కానుందని అభిమానులు సంతోషిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఓ స్టూడెంట్ లీడర్గా తారక్ను చాలా పవర్ఫుల్గా చూపించనున్నాడట కొరటాల.
దీనికి తోడు యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో ఈ సినిమాతో తారక్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించి 2022 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మరి ఈ సినిమా ఎలాంటి కథతో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయం కూడా తెలియాల్సి ఉంది.