ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది తగ్గుముఖం పడుతూ ఉన్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా ప్రారంభంలో కేసులు పెరిగిపోవడంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వ మొదట నైట్ కర్ఫ్యూ విధించగా ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో పగటిపూట కూడా కర్ఫ్యూ విధిస్తూ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
అయితే ప్రస్తుతం చాలా వరకు వైరస్ అదుపులోకి రావడంతో కర్ఫ్యూ వేళల్లో గత కొద్ది రోజుల నుండి ఏపీ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో తాజాగా ఈ రోజు నుండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విసులు పాటు కల్పిస్తూ కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే ఉభయా గోదావరి జిల్లాలో కేసులు ఇంకా భారీగానే బయటపడుతూ ఉండటంతో ఆ రెండు జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సడలింపు ఇవ్వటం తర్వాత రాత్రి పది నుండి ఉదయం 6 గంటల వరకుకర్ఫ్యూను అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక రెండు గోదావరి జిల్లాలో సాయంత్రం 6 గంటల నుండి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.