భారతీయ రైల్వే శాఖ తత్కాల్, వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల నిబంధనలను సవరించింది.ఇదే సమయంలో ప్రత్యామ్నాయ రైళ్లలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించే వికల్ప్ స్కీమును మరింతగా విస్తరించింది.
మారిన నిబంధనల ప్రకారం.
* తత్కాల్ టికెట్లను క్యాన్సిల్ చేస్తే, ప్రస్తుతం ఎటువంటి రిఫండ్ రాదు.
ఇకపై సగం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
* తత్కాల్ బుకింగ్ సమయమూ మారింది.
ఏసీ కోచ్ లకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, స్లీపర్ కోచ్ ల్లో బెర్తుల కోసం 11 నుంచి 12 గంటల వరకూ కౌంటర్లు ప్రత్యేకంగా పనిచేస్తాయి.
* రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో మొబైల్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు.
ఈ రైళ్లలో బోగీల సంఖ్య పెరగనుంది.
* సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్టులోని వారికి, తదుపరి అదే రూట్లో వచ్చే రైళ్లలో ఖాళీలను బట్టి బెర్తుల కేటాయింపు.
బెర్తు కేటాయించిన తరువాత చార్జీల తేడాలున్నా రిఫండ్ రాదు, అదనపు చార్జీలూ ఉండవు.
* గమ్యస్థానం వచ్చే సమయానికి ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు వేకప్ కాల్ సదుపాయం.