కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చంద్రబాబు నాయుడు స్పందించారు.ఈ క్రమంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం సహా పలు ప్రాజెక్టులు మరియు పాలు కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.21 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని చంద్రబాబు నాయుడు నిలదీశారు.విభజన చట్ట ప్రకారం రాష్ట్రంలో ఏడు వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్న వాటిని సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు.
ఇంక రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో కూడా జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని పేర్కొన్నారు.రాష్ట్ర విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్.ఇలాంటి సమయంలో 21 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు అని వైసిపి పై చంద్రబాబు ధ్వజమెత్తారు.నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రం పై ఒత్తిడి తీసుకురావటంలో సీఎం జగన్… వైకాపా ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
సొంత కేసులు మరియు స్వప్రయోజనాలకు మాత్రమే వైకాపా ఎంపీలు కట్టుబడి ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.