ఏపీలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ ఎన్ని విడతల యాత్రలు చేసిన తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
చంద్రబాబు రక్తంలోని ప్రతి అణువులో వెన్నుపోటు ఉందని కొడాలి నాని ఆరోపించారు.చంద్రబాబును నమ్మితే పవన్ అధోగతి పాలవుతారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ తప్పులను పవన్ ఎత్తిచూపితే అభ్యంతరం లేదన్న ఆయన చంద్రబాబు, బినామీలతో కలిసి తమపై దాడి చేస్తే సహించేది లేదని తెలిపారు.తాము కూడా అదేస్థాయిలో ప్రతి విమర్శ చేస్తామని వెల్లడించారు.
మంత్రి పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు.ఏపీ నుంచి చంద్రబాబును తరిమికొట్టే వరకు పెద్దిరెడ్డి నిద్రపోరని వెల్లడించారు.