షర్మిల వివాదం: జేసీ బ్రదర్స్ కి 'క్లాస్' పీకిన బాబు !

ఎప్పుడూ ఎదుటువారి మీద విరుచుకుపడుతుంతో… ఎంతటి హోదాలో ఉన్నవారినైనా… ఎటువంటి మొహమాటం లేకుండా… తిట్ల దండకం అందుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటారు… అనంతపురం పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర రెడ్డి .అంతెందుకు వారి దూకుడికి చంద్రబాబు నాయుడు కూడా భయపడిపోతుంటారు.జేసి బ్రదర్స్ తీరుకి భయపడి ఎవరూ వారితో ఎటువంటి వివాదం పెట్టుకోరు.అయితే… ప్రస్తుతం జేసీ బ్రదర్స్ ని అమరావతికి పిలిచి ‘మందలించారు’ సీఎం చంద్రబాబు.అనంతపురం జిల్లా రాజకీయ పరిస్థితిపై చర్చలు జరిపి.పనిలో పనిగా వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

 Chandrababu Warning On Jc Brothers-TeluguStop.com

తనకు సినీహీరో ప్రభాస్‌కి అక్రమ సంబంధం ఉన్నట్లు పుకార్లు లేవదీసి.తన వ్యక్తిత్వం మీద దాడికి ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ షర్మిల.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు.ముఖ్యంగా ఆమె తెలుగుదేశం నేతల్ని ఆమె టార్గెట్ చేయడంతో ఇది రాజకీయ కలకలం రేపింది.గతంలో జేసీ దివాకర్ రెడ్డి షర్మిలపై ఈ తరహా కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఆధారాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఈ బ్రదర్స్ ఇద్దరికీ ఇలా బాబు చేత అక్షింతలు పడ్డాయి.

బాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ.తనకు షర్మిల కూతురుతో సమానమన్నారు.

ఆమె కులాంతర వివాహం చేసుకున్నప్పుడు వైఎస్ కుటుంబాన్ని ప్రశంసించింది తానేనని గుర్తు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube