ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉంది వ్యవహారం.నిన్న ట్విట్టర్ వేదికగా చంద్రబాబునాయుడు వైసిపి సంవత్సర పాలనపై ఓ వీడియో విడుదల చేస్తే తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడిని దుయ్యబట్టారు.
అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు నీ ఐదేళ్ల పాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లు మార్చడానికే సరిపోయింది బాబు పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించారు.
బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట.175కు 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు… 13 జిల్లాల్ని తాను అభివృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నారు షేమ్.షేమ్.
బాబూ అంటూ ట్వీట్ చేశారు.రాజధాని అంశం మీద అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మొదలైన రభస ప్రస్తుతం వ్యక్తిగత దూషణలకు కారణమవుతుంది.
ఈ వ్యవహారం ఇప్పటికైనా ముగుస్తుందా లేదా మరింత ముదురుతుందో వేచి చూడాలి.