వైసీపీ దౌర్జన్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పార్టీ ఆఫీస్ కి పంపించండి

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశాడు.వచ్చే నెల నుండి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

 Chandrababu Video Conffrence With Party Leaders-ysrcp-panchayathi Election-tdp-a-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఏ‌పి ప్రతిపక్ష పార్టీ టి‌డి‌పి నాయకుడు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా పార్టీ శ్రేణులతో ముచ్చటించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లోని అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని కోరాడు.

బలవంతపు ఏకగ్రీవంలను అడ్డుకోవాలని సూచించాడు.పంచాయతీ ఎన్నికల తో వైసీపీ పతనానికి నాంది పలకాలని కోరాడు.

వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చాడు.ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న కారణంగ వైసీపీ నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతే సెల్ ఫోన్స్ ద్వారా రికార్డ్స్ చేసి పార్టీ కార్యలయం కు పంపాలని అన్నాడు.

పంచాయతీ ఎన్నికల ద్వారా జగన్ ప్రభుత్వానికి ముక్కుతాడు వెయ్యాలని కోరాడు.రాష్ట్రాన్ని నాశనం చెయ్యడానికి జగన్ పూనుకున్నాడని, కాపాడాలిసిన బాద్యత టి‌డి‌పి పైన ఉన్నదని గుర్తు చేశాడు.

రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ద్వారా జగన్ కు హెచ్చరికలు జారీ చెయ్యాలని అన్నాడు.రాష్ట్రనికి జగన్ శని లాగా మారాడని చంద్రబాబు ఎద్దేవా చేశాడు.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ ఎన్నికల ద్వారా తీసుకురావాలని బాబు నేతలకు సూచించాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube