ఇప్పుడు ఏపీలో అర్జెంటుగా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ప్లాన్.ఇందుకోసం తన వద్ద ఉన్న అన్ని వ్యూహాలకు పదును పెడుతున్నారు.
చడీ చప్పుడు లేని సునామీలా వైసీపీ మీద విరుచుకుపడేందుకు రెడీ అవుతున్నారు.కాగా వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాబట్టి ఒంటరిగా బరిలోకి దిగితే వైసీపీని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు.ఈ విషయంలో చంద్రబాబు పొత్తులకు సై అంటున్నారు.
పొత్తులు పెట్టుకుంటేనే వైసీపీని ఢీకొడ్డటం సాధ్యం అవుతుందని భావిస్తున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు పిలవగానే వెళ్లి ఆయనతో కలవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు.అందుకే సమయాన్ని బట్టి ఒక్కొక్కరిని తన దారిలోకి తెచ్చుకుంటున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు అందరికంటే చాలా ముందుంటారు.కాగా ఇప్పుడు కూడా పవన్ లాంటి నేతలను దారిలోకి తెచ్చుకోవడానికి లాజిక్ను వాడేస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చేతులు కలపాల్సిన అవసరం ఉందంటున్నారు.తనకు రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే చాలంటున్నారు.
ఇప్పుడు వైసీపీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని, కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూనే.ఇంకోవైపు ప్రతిపక్షాలను కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.ఇందులో చంద్రబాబు ఎక్కువగా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ చేస్తున్న ప్రచారం.ప్రతిపక్షాలను కలిసి వచ్చేలా చేసే అవకాశం ఉంది.అంటే చంద్రబాబు నాయకత్వంలోనే పొత్తులు ఏర్పడు ఛాన్స్ ఉందన్నమాట.మరి లాజిక్ గోల్ కొట్టాలని చూస్తున్న బాబు ప్లాన్ ను ప్రతిపక్షాలు ఏ మేరకు ఆక్సెప్ట్ చేస్తాయనేది మాత్రం ఎన్నికల టైమ్ వరకు వేచి చూడాలి.