రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల సమయంలో సినిమా స్టార్స్ ను నమ్ముకుంటూ ఉంటాయి.ప్రజల్లో సులువుగా వెళ్లేందుకు ఇదే సరైన మార్గం అని నమ్ముతూ ఉంటాయి.
మొదటి నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ ఎక్కువ.టీడీపీ ని స్థాపించిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు అదే బ్యాగ్రౌండ్ నుంచి రావడం టీడీపీకి చిత్ర సీమ వారు దగ్గర అయ్యారు.
అనేక మంది ఎమ్యెల్యేలు, ఎంపీలుగా , మంత్రులుగా పదవులు పొందారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి.
టీడీపీ కి కొంతమంది సినీ పరిశ్రమ వారు దూరంగా జరుగుతూ వైసీపీలోకి జంప్ చేస్తూ టీడీపీ మీద భారీగా విమర్శలు చేస్తూ ఎన్నికల సమయంలో తెగ ఇబ్బంది పెట్టేస్తుండడంతో టీడీపీ డైలమాలో పడింది.
ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు, సాంకేతిక నిపుణులు వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలుస్తున్నారు.
వారు కలుస్తున్న ప్రచారం రోజురోజుకు ఎక్కువవుతోంది.మీరు వాళ్ళని కట్టడి చేయండి” ఇదీ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులు, నిర్మాతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక లాంటి విజ్ఞప్తి.
గత పది రోజులుగా అనేక మంది జగన్ ను కలుస్తూ పార్టీలు చేరడం కొంతమంది సీటు హామీ పొందడం టీడీపీ కి మింగుడుపడం లేదు.
ఇప్పటికే కొందరు నటులు బహిరంగంగా తమ మద్దతు తెలిపినా మరికొందరు మాత్రం ఎన్నికల సమయానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు ఉంటామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.రచయిత, నటుడు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని తమ మద్దతు తెలిపారు.
వీరే కాకుండా అనేకమంది వైసీపీ వైపు చూస్తున్నారు.ఇక వెండి తెర మన్మధుడు అక్కినేని నాగార్జున కూడా ఇటీవల జగన్ ను కలిశారు.జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ ను కలిశారు.ఈ విధంగా ఒక్కొక్కరూ వైసీపీ వైపు చేస్తుండడంతో కొంతమంది సినీ పెద్దలను పిలిపోయించుకుని చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం.
టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదు కానీ వైసీపీకి మద్దతుగా మాత్రం ప్రచారం చేయకుండా చూడాలని కోరారని తెలుస్తోంది.