తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదారాబాదులో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమడలేక పోతున్నారా? ఏపీ ప్రభుత్వం ఇంకా తొమ్మిదేళ్ళు, చంద్రబాబు ఇంకా నాలుగేళ్ళు హైదరాబాదును ఉపయోగించుకునే అవకాశం ఉంది.కాని బాబుకు తెలంగాణా రాజధానిలో ఉండటం ఇష్టం లేనట్లుగా ఉంది.
అందుకే ఈ నెల (సెప్టెంబర్) 9వ తేదీ నుంచి పూర్తిగా విజయవాడకు మారిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.హైదారాబాదులో ఉండటం వాళ్ళ పూర్తీస్థాయిలో పని చేయలేక పోతున్నట్లు ఆయన అభిప్రాయ పడుతున్నారట.
విజయవాడలో ఉండటమే మంచిదని అనుకుంటున్నారు.విజయవాడలోని లింగమనేని ఎస్టేటును బాబు నివాస గృహంగా మార్చారు.
బాబు కుటుంబ సభ్యులు ఆ ఇంటిలో పూజ కూడా చేసారు.భద్రతా ఏర్పాట్లు చేసారు.
ఈ ఇంటిలో 4 పడక గదులు, రెండు పెద్ద హాళ్ళు ఉన్నాయి.దాంతో పాటు హోం థియేటర్ కూడా ఉంది.
సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది.వాస్తు పండితులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బాబు అందులోకి ప్రవేశిస్తారు.
హైదారాబాదులో ఉంటే పాలన కష్టం అయ్యే మాట నిజమే.అయితే హైదారాబాదులో కెసీఆర్ ప్రభుత్వం ఆయన్ని చికాకు పెడుతున్నది.
ఓటుకు నోటు కేసుతో ఇది తార స్థాయికి చేరింది.ఇక్కడే ఉంటే తన జాతకం బాగుండదని ఆయన అభిప్రాయ పడుతుండవచ్చు.