కొడాలి నాని వైసీపీలో కీలక నేత.ప్రస్తుతం వైసీపీ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు.
నాని పార్టీ అధికారంలో ఉన్నా, లేక ప్రతిపక్షంలో ఉన్నా కానీ నాని మాత్రం చంద్రబాబును విమర్శించడం ఆపడు.చంద్రబాబు మీద నాని ప్రయోగించే విమర్శలు, ఆయన వాడే భాషను చూస్తుంటే వామ్మో అనిపిస్తూ ఉంటుంది.
అందుకే చంద్రబాబు నానిని అంత టార్గెట్ చేస్తారు.టార్గెట్ చేసే విషయంలో నాని కూడా ఏమాత్రం తగ్గరు.
ఆయనకు చంద్రబాబు కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఏ ఆంశంలో దొరికినా కానీ వదిలిపెట్టడు.ఇక గుడివాడలో నానిని అభిమానించే వాళ్లు చాలా మందే ఉన్నారు.
ఆయన కమ్మ సామాజిక వర్గమైనా సరే సామాజిక వర్గాలకు అతీతంగా నానికి అభిమానులు ఉన్నారు.అంతే కాకుండా పార్టీలకు అతీతంగా కూడా కొంత మంది నానిని అభిమానిస్తారు.
ఈ కారణం వల్లే పోయిన సారి ఎన్నికల్లో నానిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నానిని ఓడించడం మాత్రం సాధ్యం కాలేదు.
కేవలం గుడివాడలో నానిని ఓడిస్తే కృష్ణా జిల్లా మొత్తం టీడీపీ వశమవుతోందని చంద్రబాబు ప్లాన్.అందుకోసం గుడివాడ సీటుని ఎలాగైనా సరే గెలుచుకోవాలని టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.తమను విపరీతంగా విమర్శించే నాని ఎక్కడ దొరుకుతాడా అని చంద్రబాబు వెయిట్ చేశారు.
చంద్రబాబు వెయిట్ చేసిన విధంగానే ప్రస్తుతం ఓ పెద్ద ఇష్యూలో నానికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ పడింది.దీనినే టీడీపీ ఆయుధంగా మల్చుకుంది.ఈ అంశాన్ని టీడీపీ అంత తేలిగ్గా వదిలిపెట్టడం లేదు.ఇందులో ఉన్న నిజానిజాలను తేల్చేందుకు సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీలను కూడా వేసింది.
ఈ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కూడా గుడివాడకు వెళ్లి అసలు అక్కడ ఏం జరిగిందోనని ఎంక్వైరీ చేశారు.ఎలాగైనా సరే ఈ క్యాసినో ఆంశంలో మంత్రి నానిని దోషిగా ప్రూవ్ చేయాలని టీడీపీ భావిస్తోంది.