సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విజయవాడ కేంధ్రంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షనేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమారుడిపై నిప్పులు చెరిగారు.
లోకేష్ జగన్ గురించి మాట్లాడుతూ జగన్ కు ప్రభుత్వాన్ని నిందించే హక్కు లేదు అని, ఆయన వీలుకాదు అని చెప్పిన రునమాఫీని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు అని, అంతేకాకుండా చంద్రబాబు చేస్తున్న రాజధాని అభివృద్దిని చూసి ఓర్వలేకనే జగన్ విమర్శలు చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు అని ఆయన జగన్ పై కామెంట్స్ చేశారు.ఇక ఇప్పటివరకు తండ్రి చాటు బిడ్డగానే ఎదుగుతున్న లోకేష్ పార్టీ కార్యకర్తగానే ఉంటాను అని అనేకమార్లు స్పష్టం చేశారు.
అయితే ఎన్నికల్లో పోటీ విషయమై పత్రికా విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మన చేతుల్లో ఏముంది అంతా దైవ నిర్ణయం అంటూ దాటేయడం విశేషం.దైవ నిర్ణయం అనే కన్నా నాన్న నిర్ణయం అని ఉంటే సింక్ అయ్యి ఉండేదేమో అంటున్నాయి రాజకీయ విమర్శక వర్గాలు.