ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.తాజా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు.
తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ దగ్గరవుతోంది అనే వార్తల విషయంలో తాను ఇప్పుడు ఏమి మాట్లాడనని స్పష్టం చేశారు.జనసేన కు ఒక పాలసీ ఉంది మాకు కూడా ఒక పాలసీ ఉంది అని చెప్పుకొచ్చారు.
బీజేపీ.కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించాదు అని పేర్కొన్నారు.
కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరు, కాబట్టే బద్వేలు ఉప ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కచ్చితంగా 2024 ఎన్నికలలో బీజేపీ- జనసేన కూటమి అధికారంలోకి రావటం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు.
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారానికి పవన్ కల్యాణ్ ని ఆహ్వానిస్తాం అని స్పష్టం చేశారు.నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని తెలిపారు.
ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని అన్నారు.అందు వల్లే అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో.
ఆయన మాట మేరకు ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో.మాట్లాడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.