ఏపీ రాజధాని అమరావతి విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరికి మెజారిటీ ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నాయి.ఆది నుంచి కూడా ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టేలా పార్టీ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.
రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి సమున్నతమైన ఒక రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసేలా చంద్రబాబు చేసినకృషిని కూడా ప్రజలు ప్రశంసిస్తున్నారు.ఇక, జగన్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకి వచ్చినప్పుడు టీడీపీ ఎత్తుకున్న ఉద్యమ అజెండా కూడా ప్రజల ప్రశంసలు అందుకుంది.
అమరావతిని నిలబెట్టుకునేందుకు ఎంత వరకు చేయాలో అంతకు మించే చంద్రబాబు ప్రయత్నాలు సాగించారనేది వాస్తవం కూడా! ప్రపంచ స్థాయిలో తెలుగు వారిని ఐక్యం చేసి, రాజధానిని నిలబెట్టుకునేందుకు ఉన్న అన్ని ఆయుధాలను ఆయన వినియోగించిన వైనం మేధావి వర్గాన్ని కూడా ఆకర్షించింది.తన చేయి దాటిపోయిందని తెలుసుకున్న చంద్రబాబు రైతులకు ఉద్యమాన్ని నడిపించే బాధ్యతను అప్పటించి, వారికి పరోక్షంగా అన్ని విధాలా సహకారం అందించిన తీరు కూడా బాగుందని చెబుతున్నారు.
అయితే.ఇటీవల కాలంలో టీడీపీలోనే కొందరు నాయకులు ఈ ఉద్యమం విచ్చిన్నమయ్యేలా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు.
తాము సాధించాల్సిన విషయాన్ని టీడీపీ నాయకులు పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు.అనేది వీరి ప్రధాన విమర్శ.ఏదైనా విషయాన్ని సాధించాలని అనుకున్నప్పుడు.దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.అయితే.ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా.
రాజధానిని మీరు నిర్మించలేరు.అమరావతిని మార్చలేరు.
అంటూ చేస్తున్న వ్యాఖ్యలు సహజంగానే వైసీపీ నేతల్లో పౌరుషాన్ని మరింత పెంచుతున్నాయి.అలా కాకుండా రాజధానిని ముందుకు తీసుకువెళ్లేలా.
దీనిని ఏర్పాటు చేయడంద్వారానే ఏపీ అభివృద్ధి సాకారం అవుతుందనే చంద్రబాబు ధోరణిని కొందరు నాయకులు పక్కదారి పట్టించేలా వ్యవహరించకుండా సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని.వీరికి చంద్రబాబు క్లాస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.