ఏపీలో ఏబీఎన్తో పాటు కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను అనధికారికంగా నిలిపేయాలని మంత్రులు మరియు ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి ఆదేశాలు వెళ్లాయంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.వైకాపా నాయకులకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసినందుకు ఆ ఛానెల్స్పై కక్ష సాధిస్తున్నట్లుగా తెలుగు దేశం పార్టీ విమర్శలు చేస్తోంది.
పల్నాడులో జరిగిన హింసను కవరేజ్ చేసిన కారణంగానే ఆ మీడియా ఛానెల్స్ పై ఈ చర్యలు తీసుకున్నట్లుగా వారు అంటున్నారు.
ఈ విషయమై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.
రాష్ట్రంలో కొన్ని ఛానెల్స్ ప్రసారాలను నిలిపేసినట్లుగా నాకు సమాచారం అందింది.స్వయంగా మంత్రులు కేబుల్ ఆపరేటర్లకు ఫోన్స్ చేసి మరీ ఆ ఛానెల్స్ను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని బాబు అన్నాడు.
తాము ఏ ఛానెల్స్ చూడాలి అనేది వినియోగదారుల ఇష్టం.దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు.
అలా చేయడం ట్రాయ్ నిబంధనలకు విరుద్దం.అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కిన విధంగానే మీడియా గొంతు నొక్కేందుకు ఈ విద్యమైన అనధికారిక చర్యలు తీసుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.
ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్దం అవుతామని తెలుగు దేశం పార్టీ నాయకులు హెచ్చరించారు.