టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అనేక ఆటుపోట్లు సంక్షోభాలు సవాళ్లు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని పనిచేయటం జరిగిందని స్పష్టం చేశారు.
కరోనా ఎదుర్కొనే విషయంలో వైసిపి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు.అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంటే కచ్చితంగా ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే వారమని పేర్కొన్నారు.
ఇటీవల మచిలీపట్నంలో మృతి చెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
నరసింహారావు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు బంధువు కావడంతో చంద్రబాబు రావడం జరిగింది.
ఇదే క్రమంలో రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించడానికి చాలా ఆలస్యం చేస్తుందని ఈ తరుణంలో రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు సదరు రైతులను బెదిరిస్తున్నారని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని కొంతకాలం మాత్రమే పాలన చేయటం జరుగుతుందని తర్వాత రైతుల తిరగబడితే ప్రభుత్వాలు తట్టుకోలేవు అని హెచ్చరించారు.
ఇదే సమయంలో పోలీసులు కూడా హుందాగా వ్యవహరించాలని గతాన్ని పరిశీలిస్తే ఆయనను నమ్ముకున్న వాళ్లంతా జైలుకు వెళ్లారని అంటూ జగన్ ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.